విజయవాడ (జూలై – 20) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై త్వరలోనే గైడ్ లైన్స్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఆగస్టు 7న .జీవో ఇస్తామని తెలిపారు.
జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై కసరత్తు తుది దశలో ఉందని… త్వరలో కారుణ్య నియామకాలు చేపడతామని జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల సమస్యలకు సంబంధించి జరిగిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అనంతరం వెల్లడించారు.