హైదరాబాద్ (మార్చి 03) : నిజాం వారసుడిగా నవాబ్ రౌనక్ ఖాన్ ఏకగ్రీవంగా ప్రకటించినట్టు నిజాం వారసత్వ కమిటీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మొఘల్పురలోని ఆజం ఫంక్షన్ హల్ లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన నిజాం కుటుంబ సభ్యులు.. నిజాం వారసుడిగా 9వ నిజాంగా నవాబ్ రౌనకాఖాన్ ను ఎంపిక చేసినట్టు ప్రకటించారు.
ఇక నుంచి రౌనక్ ఖాన్ నేతృత్వంలో నిజాం ట్రస్ట్ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు రౌనక్ ఖాన్ కు అపురూపమైన బహుమతులను అందించి అభినందించారు.