ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీపై ఇటలీకి చెందిన యాంటీ ట్రస్ట్ అథారిటీ ‘AGCM’ దాదాపు రూ.88 కోట్లు జరిమానాను విధించింది.
యాపిల్ ఐఫోన్లు నీటిలో పడ్డా ఏమీ కాదని (వాటర్ రిసిస్టెంట్) ‘తప్పుదారి’ పట్టించే విధంగా కంపెనీ ప్రచారం చేసిందని.. అసలు ఏ పరిస్థితుల్లో నీటి నుంచి రక్షణ ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. కేవలం కొన్ని సందర్భాల్లోనే ఐఫోన్లు వాటర్ రిసిస్టెంట్గా ఉన్నాయని తెలిపింది.