తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మందిని ఉత్తీర్ణులుగా ప్రకటించారు.. ఇందులో 2,28,754 మంది బాలికలు, 2,22,831 మంది బాలురు ఉన్నారు. 1,04,886 మంది విద్యార్థులు గ్రేడ్ -ఏ 61,887 మంది గ్రేడ్ -బి సాధించగా.. 1,08,093 మందికి సీ గ్రేడ్ వచ్చింది.
ఫలితాలను వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. http://tsbie.cgg.gov.in, http://examresults.ts.nic.in, http://results.cgg.gov.in
ఫలితాలతో సంతృప్తి చెందని విద్యార్థులకు పరిస్థితులు మెరుగయ్యాక ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.