తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం(2020-21) ఫలితాలు విడుదల అయ్యాయి. మొదటి సంవత్సరంలో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.
అయితే మార్కుల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉన్న విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డు కల్పించింది.
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు గడువు డిసెంబర్ 22 వరకు కలదు.
రీకౌంటింగ్ కోసం పేపర్కు రూ.100, స్కాన్ కాపీతో పాటు రీవెరిఫికేషన్ కావాలనుకునే విద్యార్థులు పేపర్కు రూ.600 ఫీజు చెల్లించి ఈ సేవలు పొందవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.