కరోనా సెకండ్ వేవ్అ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులకు కేంద్ర పన్ను చెల్లింపుల శాఖ ఊరట కల్పించింది. ఐటీ రిటర్నుల దాఖలు గడువును పొడిగించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యక్తుల రిటర్నుల దాఖలు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
కంపెనీలకు సైతం రిటర్నుల దాఖలుకు నవంబర్ 30 వరకు అవకాశం ఇచ్చింది. కొవిడ్ వేళ పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) వెల్లడించింది. వ్యక్తులకు ఇప్పటి వరకు రిటర్నుల దాఖలుకు జులై 31 వరకు,.కంపెనీలకు అక్టోబర్ 31గా గడువు ఉండేది.
కంపెనీలు తమ ఉద్యోగులకు జారీ చేసే ఫారం -16 గడువును సైతం సీబీడీటీ పొడిగించింది. జులై 15 వరకు ఇందుకు గడువును నిర్దేశించింది.
● కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ ::
ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలును సులభతరం చేసేందుకు కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పాత పోర్టల్ www.incometaxindiaefiling.gov.in స్థానంలో కొత్తపోర్టల్ http://www.incometaxgov.in ను తీసుకొచ్చింది. జూన్ 7 నుంచి ఈ కొత్త పోర్టల్ అందుబాటులోకి రానుంది. అయితే, జూన్ 1 నుంచి 6వ తేదీ వరకు పాత పోర్టల్ పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉండదని ఐటీ శాఖ పేర్కొంది.
పాత పోర్టల్ :: http://www.incometaxindiaefiling.gov.in
కొత్త పోర్టల్ :: www.incometaxgov.in