తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్లో తెలిపింది. మహమ్మారి బారినపడి మరో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో 15,472 క్రియాశీల కేసులున్నాయని,
దేశంలో కూడా కరోనా విలయం సృష్టిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 780 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.