తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ప్రతిష్ఠాత్మక ‘టాప్-20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ’ అవార్డును అందుకున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మల్టీ ఎథినిక్ అడ్వయిజరీ టాస్క్ఫోర్స్, మల్టీ ఎథినిక్ కోయలిషన్ సంస్థ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కి ఈ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
సోమవారం చికాగోలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభలో 18 మందికి ఈ అవార్డులను వర్చువల్ విధానం అందజేశారు. ఈ సందర్భంగా యూఎస్ కాంగ్రెస్మ్యాన్ డ్యానీ కే డేవిస్కు గవర్నర్ తమిళిసై కృతజతలు తెలిపారు.