తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పాలీసెట్) 2021 పరీక్ష జూన్ 12వ తేదీన జరగనుంది.
డిప్లొమా ఇన్ ఇంజినీర్ (పాలిటెక్నిక్), అగ్రికల్చర్, పశు సంవర్ధక, ఫిషరీస్ కోర్సులలో ప్రవేశాల కోసం పాలీసెట్ నిర్వహించనున్నారు.
ఫలితాలను జూన్ 24న ప్రకటించనున్నారు. ఈ మేరకు ఎస్బీటీఈటీ శనివారం షెడ్యూల్ను వెల్లడించింది. మే 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉండనుంది.