సీఎం మార్పు గురించి ఇక చర్చ ఆపాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. సీఎం మార్పు గురించి వస్తున్న ఊహాగాలు ఉహగానాలే అని ఆయన కొట్టిపారేశారు. ఆదివారం టీఆర్ఎస్ భవన్లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు.
‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిని, నాకు పదవులు ముఖ్యం కాదు.. ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశాను. మరో పదేళ్లు సీఎంగా నేనే ఉంటానని గతంలోనే అసెంబ్లీలో చెప్పాను.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కొత్త సీఎం అంటూ ఎందుకు అలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ఏప్రిల్లో టీఆర్ఎస్ భారీగా బహిరంగ సభ ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని, మార్చి 1 నుంచి పార్టీ కమిటీల ఏర్పాటు ప్రారంభించాలని నేతలకు చెప్పారు. సమావేశంలో పలు అంశాలపై పార్టీ నాయకులతో ఆయన మాట్లాడారు