కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యామండలి విద్యార్థుల నుండి వసూలు చేసే ఆరు రకాల ఫీజులను ఈ సంవత్సరానికి రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇంటర్ విద్యామండలి ఉత్తర్వుల ప్రకారం
- రీ-అడ్మిషన్.
- సెకండ్ ఇయర్ లో టీసీతో మరో కళాశాలలో ప్రవేశం.
- ప్రథమ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్, మాధ్యమం, గ్రూపు మార్పు.
- సెకండ్ ఇయర్ లో గ్రూపు మార్చుకోవడం వంటి ఆరు రకాల సేవలకు ఈ విద్యా సంవత్సరంలో ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే బోర్డుకు చాలా మంది విద్యార్థులు ఫీజులను చెల్లించారు. ఈ ఫీజుల విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.