హైదరాబాద్ (ఆగస్టు 09) : తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా, వివిధ ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం కొత్తగా 234 గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది.